ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం: షర్మిల

60చూసినవారు
ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం: షర్మిల
రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఎన్నికల్లో ఓటమిపై స్పందించిన ఆమె బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ప్రత్యేక హోదా రావాలి. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆమె ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్