ఏపీకి మరోసారి తుపాను ముప్పు.. ఐఎండీ హెచ్చరిక

63చూసినవారు
ఏపీకి మరోసారి తుపాను ముప్పు.. ఐఎండీ హెచ్చరిక
ఏపీకి తుపాను ప్రభావం పొంచి ఉంది. ఐఎండీ సూచనల ప్రకారం బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడింది. 23వ తేదీ నాటికి తుపానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 24, 25న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్