త్వరలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లిస్తాం: మంత్రి లోకేశ్

57చూసినవారు
త్వరలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లిస్తాం: మంత్రి లోకేశ్
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. 'వైసీపీ ప్రభుత్వం రూ.3,500 కోట్లు చెల్లించకుండా మోసం చేసింది. ఈ సమస్యను పరిష్కరించడానికి మంత్రివర్గం, ఉన్నతాధికారులతో చర్చిస్తున్నా. త్వరలోనే మీరు శుభవార్త వింటారని హామీ ఇస్తున్నా. నేను మీతోనే ఉన్నా' అని ట్వీట్ చేశారు. రేపు క్యాబినెట్ భేటీలోనే నిధుల విడుదలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్