నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

54చూసినవారు
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈవాళ ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. తర్వాత అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం జరగనుంది. ఈ దఫా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలన్నది నిర్ణయం తీసుకుంటుంది. ఐదు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశముంది.

సంబంధిత పోస్ట్