కాకినాడ జిల్లా మూలపేటలోని సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పరిశ్రమలో సీబీఐ దాడులు చేపట్టింది. శుక్రవారం ఉదయం 11గంటల నుంచి ఏడుగురు సీబీఐ అధికారుల బృందం వివిధ విభాగాల్లో తనిఖీలు చేశారు. పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బంది, కూలీల నుంచి వివరాలు సేకరించారు. ల్యాబ్ను పరిశీలించి ఫోరెనిక్స్ బృందాన్ని పిలిపించారు. ల్యాబ్లో ఉన్న వివిధ శాంపిల్స్ సేకరించి విశాఖకు తరలించినట్లు సమాచారం.