దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 190.75 పాయింట్ల లాభంతో 72,831.94 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 84.80 పాయింట్లు లాభపడి 22,096.75 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 34 పైసలు క్షీణించి 83.47గా ముగిసింది. యూపీఎల్, మారుతీ సుజుకీ, హీరో మోటార్స్, బజాజ్ ఆటో, సన్ఫార్మా షేర్లు లాభపడ్డాయి.