డీలిమిటేషన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా స్పందించారు. జనాభా ఆధారంగా సీట్ల విభజన దక్షిణాది రాష్ట్రాలకు నష్టమని, ఇది రాజకీయం కాదు, ప్రజల హక్కుల పోరాటమని అన్నారు. "సౌత్ సొమ్ము, నార్త్ సోకు" పరిస్థితి వస్తుందని, దీన్ని అంగీకరించేది లేదని తెలిపారు. చంద్రబాబు, పవన్, జగన్ మౌనం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు.