అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందని వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ప్రభుత్వం పథకాలను అమలు చేసిన నెల రోజులలోపు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకోసం వలంటీర్ సేవలు వాడుకోవచ్చని లేదా లేదా 1902కి ఫోన్ చేసి తగు సూచనలను పొందవచ్చన్నారు. దరఖాస్తును వెరిఫై చేశాక ఆరు నెలలకోసారి పథకాల లబ్ధి అందిస్తామని వివరించారు.