చెన్నైకి చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ తమ ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్స్ అందించింది. ఈ మేరకు ఐడియాస్2 ఐటీ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత మురళి తన 50 మంది ఉద్యోగులకు వివిధ రకాల నూతన కార్లను బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. కంపెనీ కోసం మొదటి నుండి కష్టపడుతూ, తనకు అండగా ఉన్న వారి కోసం ఇలా చేస్తున్నానని మురళి తెలిపారు.