AP: 20 జిల్లాల్లో వరద బీభత్సం.. 15 మంది మృతి

65చూసినవారు
AP: 20 జిల్లాల్లో వరద బీభత్సం.. 15 మంది మృతి
ఏపీలో వరదలు బీభత్సం సృష్టించాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ఊళ్లపై విరుచుకుపడ్డాయి. ఈ వరదల్లో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మరో ముగ్గురు వరద నీటిలో గల్లంతయ్యారని పేర్కొన్నారు. మొత్తం 20 జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగినట్లు అంచనా వేశారు. 3,79,115 ఎకరాల్లో పంట నష్టం, 34 వేల ఎకరాల్లో ఉద్యానపంటలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్