గరికపాడు వద్ద వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారి (వీడియో)

69చూసినవారు
వరద ఉద్ధృతికి ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద ఆంధ్ర-తెలంగాణ సరిహద్దులోని జాతీయ రహదారి కోతకు గురైంది. దీంతో విజయవాడ - హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీని వల్ల సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద సరుకు లారీలు, వందలాది ఇతర వాహనాలు 3 కిమీ మేర ఆగిపోయాయి. మరోమార్గం లేక ఆ వాహనాల డ్రైవర్లంతా అక్కడే పడిగాపులు కాస్తున్నారు. వారంతా జాతీయ రహదారిపైనే భోజనాలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్