తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే నడకదారిలో ఫెన్సింగ్ ఏర్పాటుపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీడీడీ) బోర్డుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వైల్డ్ లైఫ్ అధికారుల నివేదికను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని టీడీడీని కోర్టు ప్రశ్నించింది. కాగా, నడకదారిలో ఫెన్సింగ్ లేకపోవడంతో వన్యమృగాలు భక్తలపై దాడులు చేస్తున్నాయి.