ఐక్యరాజ్యసమితి సదస్సుకు ఏపీ సర్పంచ్

51చూసినవారు
ఐక్యరాజ్యసమితి సదస్సుకు ఏపీ సర్పంచ్
ఏపీకి చెందిన సర్ంచ్ కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. యూఎస్‌లోని ఐక్యరాజ్యసమితి సెక్రటేరియట్‌లో మే 3న నిర్వహించే సదస్సులో ప్రసంగింనున్నారు. ప.గో. జిల్లా ఇరగవరం మండలం పేకేరు సర్పంచ్‌గా ఉన్న ఆమె.. దేశంలో స్థానిక సంస్థల్లో మహిళల పాత్ర, మహిళా సాధికారతకు మార్గాలు అనే అంశంపై మాట్లాడనున్నారు. దేశం నుంచి ముగ్గురు ప్రజాప్రతినిధులకే ఆహ్వానాలు అందగా.. అందులో హేమ కుమారి ఉన్నారు. గతంలో ఆమె లెక్చరర్‌గా పని చేశారు.

సంబంధిత పోస్ట్