తిరుపతి జిల్లా పాకాల మండలం ఊటువంకలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. మృతులను తేజ(7), పునీత్(8), రామకృష్ణ(9)లుగా గుర్తించారు. చిన్నారుల మృతితో.. వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.