ఇవాళ టీడీపీ మూడో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. 17 ఎంపీ, 16 అసెంబ్లీ అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించే ఛాన్సుంది. బీజేపీ, జనసేనతో సీట్ల ఖరారుపై చంద్రబాబు స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ మూడో జాబితాపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. కళా వెంకట్రావ్, గౌతు శిరీష, గంటా, బండారు, దేవినేని ఉమా, ఆలపాటి, సోమిరెడ్డి తదితరులు టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు.