బీహార్లోని సుపాల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలింది. భేజా-బకౌర్ మధ్య మరీచా సమీపంలో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న వంతెనలో కొంత భాగం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయినట్లు సమాచారం. 30 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.