మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై హత్యాయత్నం కేసు

77చూసినవారు
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై హత్యాయత్నం కేసు
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. కేతిరెడ్డితో పాటు అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ కార్యకర్త ప్రతాప్ రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా సోమవారం ధర్మవరంలో రిమాండ్‌లో ఉన్న వైసీపీ కార్యకర్తలను చూసేందుకు స్థానిక సబ్ జైలుకు వెళ్లిన కేతిరెడ్డిని కూటమి నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కేతిరెడ్డి వాహనాన్ని అడ్డగించి, కారుపైకి ఎక్కిన కూటమి కార్యకర్త మీద నుంచి కారు పోనిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్