ఆ అధికారులను కలిసేందుకు ఇష్టపడని బాబు

63చూసినవారు
ఆ అధికారులను కలిసేందుకు ఇష్టపడని బాబు
టీడీపీ అధికారం చేపట్టనున్న నేపథ్యంలో పలువురు అధికారులు చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో కీలకంగా వ్యవహరించిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, సీనియర్ ఐపీఎస్ కొల్లి రఘురామిరెడ్డిని కలిసేందుకు చంద్రబాబు నిరాకరించారు. నేడు ఆయన్ని కలిసేందుకు వచ్చిన అధికారులను ప్రధాన గేటు వద్దే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో చేసేదిలేక వారు వెనుదిరిగారు.

సంబంధిత పోస్ట్