ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం: నారాలోకేష్

51చూసినవారు
ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం: నారాలోకేష్
నేడు వైసీపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ బ్యాండేజ్ లేకుండా కనిపించడంతో ప్రజల ట్రోలింగ్ దెబ్బకు జగన్ కట్టును తీసేశారని ప్రతిపక్ష నేతలు సెటైర్లు వేస్తున్నారు. తాజాగా టీడీపీ నేత నారా లోకేష్ జగన్ పై ఒక వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. 'ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం.. జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయం' అంటూ జగన్ ఫోటోని జత చేసి ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్