పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఆదేశాలను పక్కాగా అమలు చేయాలని NDA నేతలు రాష్ట్ర సీఎస్ జవహర్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో సీఎస్ను కలిసిన కూటమి నేతలు ఈ మేరకు వినతిపత్రం అందించారు. 'మే నెల పింఛను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలి. పెన్షన్ల పంపిణీపై ఈసీ ఆదేశాలను పక్కాగా అమలు చేయాలి.' అని వినతిపత్రంలో పేర్కొన్నారు.