లోక్సభ ఎన్నికల వేళ ఢిల్లీలోని ప్రఖ్యాత కుతుబ్ మినార్ త్రివర్ణ పతాకంతో మెరిసిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర ఎన్నికల సంఘం ఎక్స్లో షేర్ చేసింది. పార్లమెంట్ భవనం, ఎన్నికల సంఘం లోగోతోపాటు ఎన్నికలకు సంబంధించిన అంశాలను కుతుబ్ మినార్పై ప్రదర్శించారు. కాగా ఢిల్లీలో మే 25న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రజలకు వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తోంది.