నీట్ పరీక్షని రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా జులై 4వ తేదీన విద్యాసంస్థల బంద్కు ఏఐఎస్ఎఫ్ పిలుపునిచ్చింది. తిరుపతిలో రెండు రోజుల పాటు ఏఐఎస్ఎఫ్ జాతీయ సమావేశాలు జరిగాయి. నీట్ పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరుతూ దేశవ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తామని ఏఐఎస్ఎఫ్ ప్రకటించింది.