కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ (కరువు భత్యం) విషయంలో త్వరలో గుడ్ న్యూస్ అందనుంది. జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు 18 నెలల పాటు DA, DR చెల్లింపులను కోవిడ్ దృష్ట్యా కేంద్రం నిలిపి వేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకిి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ నేషనల్ కౌన్సిల్ కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా తాజాగా లేఖ రాశారు. 18 నెలల డీఏ బకాయిలు విడుదల చేయాలని ఆ లేఖలో కోరారు.