ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్కు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అంటే భయమన్నారు. అయ్యన్నపాత్రుడిని స్పీకర్గా ప్రకటించినప్పటి నుంచి జగన్ అసెంబ్లీకి రాలేదన్నారు. గత ప్రభుత్వం అయ్యన్నను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని, ఇప్పుడు ఆయనను భిక్ష అడిగితే గానీ ప్రతిపక్షహోదా రాని పరిస్థితి వచ్చిందన్నారు. రెడ్ బుక్ నాకంటే అయ్యన్నపాత్రుడి వద్ద ఉంటేనే బాగుంటుందన్నారు.