ఉత్తరప్రదేశ్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో రిక్షా ట్రాక్టర్ ట్రాలీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఉన్న ఆటోను బస్సు ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదాన్ని చూసిన బస్సు డ్రైవర్ వెంటనే అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.