పోలీస్ వారి సూచనలు పాటించాలి: సీఐ

76చూసినవారు
అద్దంకి సర్కిల్ పరిధిలోని మెదరమెట్ల, కొరిసపాడు, రేణింగివరం పరిధిలోని ప్రజలందరూ గణేష్ ఉత్సవాల పట్ల పోలీస్ వారి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సీఐ మల్లికార్జున రావు శుక్రవారం మీడియా ప్రకటన ద్వారా తెలిపారు. నిమజ్జనం తేదీలను తప్పనిసరిగా పోలీస్ వారికి తెలియజేయాలని ఆయన సూచించారు. ఉత్సవాలకు సంబంధించి పూర్తి బాధ్యత కమిటీ సభ్యులదేనని అన్నారు. ప్రతి ఒక్కరూ పోలీస్ వారికి సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్