గుంటూరు నగరంలో పడకేసిన పారిశుధ్యం

77చూసినవారు
గుంటూరు నగరంలోని కొన్ని శివారు ప్రాంతాల్లో ఎక్కడి చెత్త అక్కడే దర్శనమిస్తోంది. జీఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది విజయవాడ వరద సహాయక చర్యల్లో నిమగ్నం అవ్వడంతో గుంటూరు నగరంలో పారిశుద్ధ్యం పడకేసింది. దీంతో చెత్త గుట్టలుగా పేరుకుపోయి వర్షంతో తడిచి దుర్గంధం వెదజల్లుతోంది. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పారిశుద్ధ్య సమస్య ని పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్