గురజాల ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

70చూసినవారు
గురజాల ప్రభుత్వ ఆసుపత్రిని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన ఆసుపత్రి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆసుపత్రికి వచ్చిన ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్