ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

78చూసినవారు
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
మార్టూరు మండలం జొనతాళి గ్రామంలో శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొని మాట్లాడారు. ఏ ప్రభుత్వము చేయని విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకేసారి పెన్షన్ నగదును పెంచాడని అన్నారు. మెగా డీఎస్సీ తో నిరుద్యోగులకు మేలు చేశాడని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్