పొన్నూరు: ఈనెల 21న అష్టావధాన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

85చూసినవారు
పొన్నూరు: ఈనెల 21న అష్టావధాన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
బ్రాహ్మణ మహాసభ పొన్నూరు వారి ఆధ్వర్యంలో ఈనెల 21న సా. 6. 30గo. లకు బ్రాహ్మణ బజార్ శంకరమఠంలో అష్టావధాన కార్యక్రమం జరుగుతుందని బ్రాహ్మణ మహాసభ పూర్వాధ్యక్షులు పులిపాక వెంకట సత్యసాయి వరప్రసాద్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని శంకరమఠంలో మీడియాతో మాట్లాడారు. అద్దంకి పట్టణానికి చెందిన నారాయణ బాలసుబ్రమణ్యం అవధానిచే కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. పట్టణ ప్రముఖులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్