పొన్నూరులో మంచి నీటి పైపుల లీకులు... పట్టించుకోని అధికారులు

54చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని మున్సిపల్ మంచినీటి పైపులు రోజులు తరబడి లీకులు అవటంతో పాటు నీరు కలుషితమవుతున్నాయి. 19, 21, 23, 29 వార్డుల్లో పైపుల ద్వారా నీరు వృధాగా పోతున్న సచివాలయ ఇంజనీరింగ్ సిబ్బంది పట్టించుకోవడంలేదని ప్రజలు శుక్రవారం మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టకపోతే నీరు కలుషితమై ప్రాణాంతకర వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్