కొల్లిపరలో నగదు చోరీ

70చూసినవారు
కొల్లిపరలో నగదు చోరీ
కొల్లిపరలో నగదు చోరీ జరిగిన ఘటన సోమవారం వెలుగు చూసింది. ఎస్ఐ పి. కోటేశ్వరరావు వివరాల మేరకు కొల్లిపర గ్రామానికి చెందిన గుదిబండి రామిరెడ్డి కుటుంబ సభ్యులతో శనివారం హైదరాబాద్ లోని బంధువుల ఇంటికి వెళ్లి సోమవారం తిరిగి వచ్చారు. అయితే ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో ఆందోళన చెందారు. వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో దాచుకున్న రూ. లక్ష కనిపించకపోవడంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్