వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు సోమవారం తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితులు ఆయనను ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందించారు. రాష్ట్రంలోని ప్రజలందరూ సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.