అరకు వైసీపీ ఎంపీ పార్టీ మారుతున్నారా?

53చూసినవారు
అరకు వైసీపీ ఎంపీ పార్టీ మారుతున్నారా?
ఏపీలో ఈసారి ఎన్నికల ఫలితాలతో డీలా పడ్డ వైసీపీకి గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యేలను కాపాడుకోవడం సవాలుగా మారబోతోంది. వైసీపీ ఎంపీలను బీజేపీ లాక్కోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. గతంలో అరకులో వైసీపీ తరపున గెలిచిన కొత్తపల్లి గీత అనంతరం బీజేపీలోకి ఫిరాయించడంతో.. తాజాగా గెలిచిన చెట్టి తనూజారాణి విషయంలోనూ అదే జరగబోతోందనే ప్రచారం ఊపందుకుంటోంది. ఈ విషయమై అరకు ఎంపీ చెట్టి తనూజారాణి క్లారిటీ ఇచ్చారు. ప్రాణం ఉన్నంతవరకు జగనన్నతోనే మా ప్రయాణం అంటూ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్