సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ: సజ్జల

239361చూసినవారు
సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ: సజ్జల
ఎన్నిక‌ల వేళ వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయ‌డంపై ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆంక్ష‌లు విధించిన నేప‌థ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈసారి పెన్షన్లను వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇవ్వర‌ని.. ల‌బ్ధిదారులే గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి తెచ్చుకోవాల‌ని వెల్ల‌డించారు. మూడో తేదీ నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తామ‌ని తెలిపారు. పెన్షనర్లు ఆందోళన పడాల్సిన అవసరం లేద‌ని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్