భానుడి భగభగలు.. 3 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు

273064చూసినవారు
భానుడి భగభగలు.. 3 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో HYD వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాగల 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ రాత్రి సమయాల్లో సాధారణం కంటే వేడిగా ఉండే అవకాశాలున్నాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్