ఉత్తర గాజాలో పాలస్తీనియన్లపై శనివారం ఇజ్రాయిల్ మరోసారి విరుచుకుపడింది. సాయం కోసం వేచివున్న వారిపై జరిపిన తుపాకీ కాల్పుల్లో ఐదుగురు మరణించినట్లు పాలస్తీనా రెడ్ క్రెసెంట్ తెలిపింది. దీంతో ఆ ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో డజన్ల కొద్తీ గాయపడ్డారని పేర్కొంది. ఈ ప్రాంతంలో కరువు పొంచి ఉందని తెలిపింది.