ఏపీ రాజధాని అమరావతిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రేగితోట సమీపంలో ఓ నిర్మాణానికి గుంతలు తీస్తుండగా మృతదేహం కనిపించింది. దీంతో నిర్మాణం చేపట్టిన వ్యక్తి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అలాగే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.