అన్నమయ్య జిల్లాలో మహిళా దినోత్సవం రోజునే దారుణం చోటుచేసుకుంది. నిమ్మనపల్లి మండలం నాయనవారిపల్లెలో ఓ మహిళపై ఇద్దరు కీచకులు అత్యాచారం చేశారు. సదరు మహిళ పాలు పోసి వస్తుండగా దారిలో అడ్డగించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.