ఉద్యోగాల కల్పన పేరుతో, కార్పోరేట్లకు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్వయం ఉపాధి పొందుతున్న ఆటో రిక్షా కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎటువంటి సామాజిక భద్రత లేని ఆటో డ్రైవర్ల జీవన ప్రమాణాలను పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి. వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి.