మిస్టరీగా మారిన యువతి బ్రెయిన్ డెడ్ కేసు

66చూసినవారు
మిస్టరీగా మారిన యువతి బ్రెయిన్ డెడ్ కేసు
కనిపించకుండా పోయిన యువతి ఆస్పత్రిలో కనిపించిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. మధిర సహన అనే యువతిని నవీన్ అనే రౌడీషీటర్ శనివారం కారులో తీసుకెళ్లాడు. కొన్ని గంటల తర్వాత యువతిని తెనాలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. సహన తల్లిదండ్రులకు సమాచారమిచ్చి వెళ్లిపోయాడు. యువతి ఆస్పత్రిలోకి వచ్చే సరికి బ్రెయిన్ డెడ్ అవ్వడంతో వైద్యులు చికిత్స చేయలేమని చేతులెత్తేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్