వైసీపీని దారుణ పరాజయ భయం వెంటాడుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎక్స్ (ట్విటర్) వేదికగా విమర్శించారు. ఓ వైపు ఫేక్ ప్రచారాలు, మరోవైపు దాడులకు తెగబడుతోందని ఆరోపించారు. ఒంగోలులో టీడీపీ అభిమానులపై దాడి దుర్మార్గపు చర్య అన్నారు. సమతానగర్ కాలనీవాసులపై బాలినేని శ్రీనివాసరెడ్డి గ్యాంగ్ దాడిని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. బాలినేని గ్యాంగ్పై ఎన్నికల అధికారులు కేసు నమోదు చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు.