రంజాన్ పండుగ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ముస్లీంల ప్రత్యేక నమాజ్ దృష్ట్యా మాసాబ్ ట్యాంక్, పురానాపూల్, కామాటిపురా, కిషన్ బాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాహనాల దారి మళ్లింపుతో పాటు పలుచోట్ల రోడ్ క్లోజ్ చేస్తామని తెలిపారు. ఈ ఆంక్షలు ఉదయం 11.30 గంటల వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.