జెరూసెలం, గాజా, వెస్ట్ బ్యాంకులలో నివసిస్తున్న పాలస్తీనియన్లకు, ఇజ్రాయెల్కు మధ్య ఉద్రిక్త పరిస్థితి ఉంది. హమాస్ సంస్థ ఎన్నోసార్లు ఇజ్రాయెల్తో పోరాడింది. దీంతో హమాస్కు ఆయుధాలు చేరకుండా ఇజ్రాయెల్ గాజా సరిహద్దుల్లో కాపలా కాస్తుంది. ఈ క్రమంలోనే హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసింది. ప్రతిగా ఇజ్రాయెల్ గాజాపై దాడి చేసింది. ఈ యుద్ధం కారణంగా రోగాలు, పస్తులు, చావులతో గాజాలోని పాలస్తీనియన్ల జీవితం ధ్వంసమైంది.