సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. విజయవాడలో జరిగిన 'విధ్వంసం' పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. "సీఎం జగన్ ఒక సభలో మాట్లాడుతూ.. చొక్కా చేతులు మడతబెట్టే సమయం వచ్చిందన్నారు. నువ్వు, వైసీపీ కార్యకర్తల చొక్కాలు మడతబెడితే.. మా టీడీపీ కార్యకర్తలు, జనసైనికులు, ప్రజలు కుర్చీలు మడతబెడతారు. అందరూ కుర్చీలు మడతబెడితే నీ కుర్చీ లేకుండా పోతుంది జగన్ రెడ్డి." అని అన్నారు.