విశాఖ స్టీల్ ప్లాంట్ ధ్వంసం చేయాలనే ఆలోచనలో కేంద్రం లేదు: పురందేశ్వరి (వీడియో)

53చూసినవారు
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ధ్వంసం చేయాలనే ఆలోచనలో కేంద్రం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. విశాఖలో మంగళవారం పురందేశ్వరి మాట్లాడుతూ.. ‘విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడి.. లాభాల్లోకి తీసుకురావాలనేది కేంద్రం ఉద్దేశం. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారు. ప్రధాని మోడీ పుట్టినరోజున అన్న క్యాంటీన్ ఖర్చు బీజేపీ భరించింది. మోడీ న్యాయకత్వంలో భారత్.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుంది.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్