స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఏ1గా చంద్రబాబు, ఏ2గా అచ్చెన్నాయుడు, ఏ3గా గంటా సుబ్బారావు, ఏ4గా మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చారు. ఈ ఛార్జ్షీట్ను సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో సమర్పించారు. కాగా, ఇప్పటికే చంద్రబాబును నిందితుడిగా చేర్చుతూ ఫైబర్ నెట్, అసైన్డ్ భూముల కేసులో సీఐడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది.