బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.500 పెరిగి రూ.64,600కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.600 పెరిగి రూ.70,470 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.1000 పెరగడంతో రూ.85,300కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.