సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మోసపూరిత ప్రకటనలతో గతంలో సీఎం జగన్ ప్రజలను నమ్మించారని విమర్శించారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. అన్నదాతల ఆత్మహత్యల్లో దేశంలో ఏపీ మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు.