పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసులు విఫలమయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఉదయం నుంచి పరిస్థితిపై తాము ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలిపారు. అయినా శాంతి భద్రతలు కాపాడలేకపోయారన్నారు. ఈసీ వెంటనే పోలింగ్ను సమీక్షించి పరిస్థితిని చక్కదిద్దాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.